Monday, May 4, 2015

POST BY ABHI.K

పల్లవి పలు మార్లు పలకరించి పులకరించినట్లుగా

మంచు బిందువులతో మకరందం సేవిస్తున్నట్టు గా
మల్లె కన్నా తెల్లనైన మీ మనసు యొక్క తళుకులుగా

పరవసించి నాట్యమాడే మయూరముల పురుల గాలిగా 
నీ వెచ్చని శ్వాసతో చలిమంట కాసుకుంటున్నట్లు గా

చల్లని చందమామ వెలుగులో పుచ్చపూలు ఆరేసినట్టు గా

జీవితము అనే నా పుస్తకమకు లో అన్ని పేజీలు నీవే

నీ అధరాలపై మెరిసిన సన్నని చిరునవ్వులో ఎప్పుడూ

జీవించాలి అని ఆశ పడుతూ ఆరాట పడుతూ

నీ రాక కోసం నా మనసు నుంచి నీకు ఎర్ర తివాచి పరుస్తున్నా...

కావాలి అని కనిపించిన ప్రతి భగవంతుని ప్రతిమని మొక్కి

అందుకో ఈనా కవితా సంపత్తిని పద్మాలువంటి నీ పాదాలచెంత ఉంచుతున్నా...




BY ABHIRAM KHANDAVILLI :)

No comments:

Post a Comment