Saturday, April 18, 2015

పార్లమెంట్లో...
కుర్చీలు మీదకే విసురుట..
బల్లలు విరిగిపోవుట..
మన లీడర్లకి ఎంత బలమో సుమీ!!
అక్కడ తెల్చుకోనెదరు అమీ తుమీ..
వీరి అరివీర పరాక్రమం చూసి అదరదా భూమి..
..
ప్రజా సమస్యలు..మా ప్రస్తావన ఏదని..
ప్రశ్నలు వేసినా..
స్పీకరు గారు..గోలనే ఆపమని..
ఆనతి ఇచ్చినా..
వినెదరా మన ఈ మానధనులు..
ఆలకించెదరా మొరలు ఈ శౌర్యఘనులు..
ఇక గంగాపాలే మన దేశ కీర్తి ప్రతిష్ఠలు

No comments:

Post a Comment