Saturday, March 5, 2016

ఒక భూతద్దం పట్టుకుని..
ప్రతి మనిషి నవ్వులోని..
నిగూడార్థం వెతకాలి..
..
..
ఎందుకూ??!! అంటారని తెలుసు..!!
..
సమాధానం ఇదిగో..
..
స్వచ్ఛత కనుమరుగైంది..
స్వార్థం రాజ్యమేలుతోంది..
"పరాయి" అనే మాటకి విలువ పెరిగింది..
కల్మషానికి కాలం దాస్యం చేస్తోంది..
..
మరి ఇక దొంగ నవ్వులు..
దొంగ పలకరింపులు ఉంటాయిగా..
అందుకే..
వెతుకులాట ప్రారంభించండి..!!
నిగ్గు తేలని నిజాల పని పట్టి..
ఇతరుల మనసుల ముసుగుల చాటున ఏముందో కనిపెట్టండి..!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment