Wednesday, November 11, 2015

నువ్వు నేను..
ఒకనాడు..
ఒకే తాటిపై నడిచేవాళ్ళం..
నీకు నాకు బేధం లేదనేంతగా..!!
మరి ఇప్పుడు??
ఒకే దారిలో వేరు వేరు దిక్కులకు పయనమై..
బంధానికి సెలవిచ్చేశాం..
"ఇక సెలవు" అనే మాటలు ఒకరికొకరం చెప్పుకున్నాం!!
నీ..నా కన్నులు మళ్ళీ ఎప్పుడు బాసలు చెప్పుకోవని...
మనసు‌ల మధ్య కూల్చలేని గోడొకటి కట్టుకున్నామని..
నాకు తెలిసింది..!!
ఏ బంధానికీ "అమృతం" అందదనీ..
మృత సంజీవని లభ్యం కాదనీ...
"శాశ్వతం "అనే పదం అక్కరకు రాదనీ..
నాకు అవగతమైంది!!

-మీ లక్ష్మి

No comments:

Post a Comment